రాయికల్ మండలంలోని సింగర్రావుపేట, మైతాపూర్ గ్రామాలలో ఉదృతంగా ప్రవహిస్తున్న వాగులను పరిశీలి
Published: Wednesday July 13, 2022
రాయికల్, జూలై 12 (ప్రజాపాలనప్రతినిధి): రాయికల్ మండలంలోని సింగర్రావుపేట మరియు మహితాపూర్ గ్రామంలో ఉదృతంగా ప్రవహిస్తున్న వాగులను పరిశీలించిన అదనపు కలెక్టర్ జె.అరుణశ్రీ వంతెనకు ఇరువైపులా భారీ గేట్స్ఏర్పాటుచేసి, వాహనాలను మరియు ప్రజల రాకపోకలను అనుమతించరాదని, షిఫ్ట్ పద్ధతులద్వారా ఇరువైపుల 24 గంటలు వంతెన వద్ద విధులు నిర్వహించాలని ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యంవహిస్తే కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని,ప్రతిరోజు సానిటేషన్ తప్పకుండా చేసి సీజనల్ వ్యాధుల ను ప్రబలకుండా తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ఎటువంటి పొరపాట్లుకు తావు ఇవ్వకూడదని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డివిజనల్ పంచాయతీ అధికారి మరియు మండల పంచాయతీఅధికారి, గ్రామసెక్రెటరీ పాల్గొన్నారు.
Share this on your social network: