ప్రాథమిక వ్యవసాయ సహకార మార్కెట్ కమిటీ డైరెక్టర్ ను సన్మానించిన గ్రామస్థులు

Published: Thursday August 25, 2022
జన్నారం, ఆగస్టు 24, ప్రజాపాలన: ప్రాథమిక వ్యవసాయ సహకార మార్కెట్ కమిటీ డైరెక్టర్ గా రెండవసారి ఎన్నికైన సందర్భంగా మురిమడుగు గ్రామానికి చెందిన మెంగని వెంకటేష్ కు అ గ్రామస్థులు సన్మానించ్చారు. బుధవారం మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని మురిమడుగు గ్రామంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ గా రెండవసారి ఏకగ్రీవంగా ఎన్నుకోవడంతో మురిమడుగు సర్పంచ్  ఇంధన్ పల్లి బాగ్యలక్ష్మి, టిఆర్ఎస్ స్థానిక అధ్యక్షుడు వై సందీప్,  పలువురు వెంకటేష్ ఘనంగా శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా మెంగని వెంకటేష్ మాట్లాడుతూ నాపై నమ్మకంతో  నాకు రెండవసారి ఈ అవకాశం ఇచ్చి మార్కెట్ కమిటీ డైరెక్టర్ పదవి కోనాసాగే విధంగా చేసినందుకు స్థానిక ఎమ్మెల్యే రేఖా నాయక్ కు ధన్యవాదాలు తెలియజేశారు. గ్రామంలోని రైతులకు గ్రామ ప్రజలకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని సందర్భంగా ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మురిమడుగు ఉప సర్పంచ్ జాడి రాజేశ్వర్, ఎంపీటీసీ జాడి భూమక్క, గ్రామపంచాయతీ సెక్రటరీ ఆత్రం జంగు, కొండ గొర్ల లక్ష్మణ్, డాక్టర్ ప్రకాష్ రావు, గ్రామపంచాయతీ సిబ్బంది, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
 
 
 
Attachments area