పల్లె ప్రగతి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నజడ్పీ

Published: Monday June 13, 2022

చైర్మన్ మధిర రూరల్ జూన్ 13 ప్రజా పాలన ప్రతినిధి మండలంలో ఆదివారం నాడు పర్యటించిన జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు నాగవరప్పాడు, మర్లపాడు, సైదెల్లిపురం గ్రామాల్లో పల్లె ప్రగతి కార్యక్రమాల్లో పాల్గొని  అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన లింగాల కమల్ రాజు .జడ్పీ నిధుల తో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన. మాటూర్ గ్రామం వద్ద జరుగుతున్న బ్రిడ్జ్ నిర్మాణ పనులు మరియు మిషన్ భగీరథ పనులను పరిశీలించిన జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు  పలు గ్రామాల్లో పర్యటించారు అందులో భాగంగా నాగవరప్పాడు, మర్లపాడు, సైదెల్లిపురం గ్రామాల్లో జరిగిన పల్లె ప్రగతి కార్యక్రమాల్లో పాల్గొని స్థానిక ప్రజాప్రతినిధులతో కలసి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు ముందుగా నాగవరప్పాడు గ్రామంలో జడ్పీ నిధుల నుండి మంజూరు అయిన సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు అనంతరం మర్లపాడు గ్రామానికి చేరుకొని గ్రామంలో జడ్పీ నిధుల నుండి మంజూరు అయిన సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అలానే అక్కడ నుండి సైదెల్లిపురం గ్రామానికి చేరుకొని గ్రామంలో జరుగుతున్న పల్లె ప్రగతి కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. అలానే మధిర మండలం మాటూర్ వద్ద జరుగుతున్న బ్రిడ్జ్ నిర్మాణ పనులను మరియు పగిలిన మిషన్ భగీరథ పైపు లైన్ పనులను ఆయన పరిశీలించారు.ఈ కార్యక్రమాల్లో మధిర వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చిత్తారు నాగేశ్వరరావు , ఆత్మ కమిటీ చైర్మన్ రంగిశెట్టి కోటేశ్వరరావు, మండల పార్టీ అధ్యక్షులు రావూరి శ్రీనివాసరావు , కార్యదర్శి బొగ్గుల భాస్కర్ రెడ్డి , సర్పంచ్ లు వేమిరెడ్డి నాగిరెడ్డి , మోరుబోయిన నాగమణి , ఎంపీటీసీ తోక రాజరాజేశ్వరి , గ్రామ శాఖలు వేమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, తోక సుబ్బారావు , రేగళ్ల శ్రీనివాస్ రెడ్డి , నాయకులు మోరుబోయిన ప్రసాద్ , ఉపసర్పంచ్ కోటేశ్వరరావు , కోటా తిరుపతి రావు  తదితరులు పాల్గొన్నారు