ఫుడ్ కోర్టును ప్రారంభించిన కార్పొరేటర్ బండారు శ్రీవాణి వెంకట్ రావు

Published: Tuesday November 22, 2022
మేడిపల్లి, నవంబర్ 21 (ప్రజాపాలన ప్రతినిధి)
రామంతాపూర్ శారద నగర్  శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన కాన ఫుడ్ కోర్ట్ ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా స్థానిక కార్పొరేటర్ బండారు శ్రీవాణి వెంకట్రావు హాజరై  ప్రారంభించారు. 
రుచికరమైన ఆహారాన్ని అందించి ప్రజల మన్ననలను పొందాలని, నిల్వ ఉంచిన ఆహారము ఉండకుండా చూసినట్లయితే వ్యాపారం మంచిగా సాగుతుందని కార్పొరేటర్ ఫుడ్ కోర్ట్ నిర్వాహకులు ప్రభుదాసుకు సూచించారు. శారదా నగర్లో ఇలాంటి ఫుడ్ కోర్టు రావడం సంతోషంగా ఉందని కార్పొరేటర్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఫుడ్ కోర్ట్ యాజమాని ప్రభుదాస్ కుటుంబ సభ్యులు, వారి మిత్రబృందం, బిల్డింగు యాజమాని దొంతిరి ప్రభాకర్ రెడ్డి, రామంతపూర్ డివిజన్ బిజెపి అధ్యక్షుడు బండారు వెంకట్రావు, బిజెపి సీనియర్ నాయకులు కందగట్ల దయానంద రెడ్డి, రామంతపూర్ డివిజన్ బిజెపి ప్రధాన కార్యదర్శి సంకూరి కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.