బాధిత కుటుంబాలను పరామర్శించిన పోతినేని

Published: Tuesday August 17, 2021
బోనకల్లు, ఆగస్టు 16, ప్రజాపాలన ప్రతినిధి : రావినూతల గ్రామంలో వివిధ కారణాలతో చనిపోయిన బాధిత కుటుంబాలను సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శ వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ ఆదివారం నాడు పరామర్శించి బాధిత కుటుంబాలను ఓదార్చి మనోధైర్యాన్ని కల్పించడం జరిగింది. మొదట కరోనా మహమ్మారితో చనిపోయిన వీర జవాన్ కందిమళ్ళ. రామకృష్ణ కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. తదుపరి కందిమళ్శ. వీరభద్రం,  పొందూరి అప్పారావు కుటుం బాలతో పాటు అనారోగ్యంతో చనిపోయిన గమిఢి. పిచ్చమ్మ కుటుంబాలను కలిసి ఓదార్చడం జరిగింది అదేవిధంగా కాలికి శస్త్రచికిత్స చేయించిన సిపిఎం సీనియర్ నాయకులు ఎస్ కే ముస్తఫాను పరామర్శించి వారి బాగోగులను అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా పోతినేని మాట్లాడుతూ కరోనా మహమ్మారి కారణంగా అనేక మంది చనిపోవడం బాధాకరమని ప్రభుత్వాలు బాధిత కుటుంబాలను ఆదుకోవాలని ప్రజలు మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని అన్నారు పరామర్శించిన వారిలో సిపిఎం జిల్లా నాయకులు మాది నేని రమేష్, సిపిఎం పార్టీ మండల కార్యదర్శి దొండపాటి నాగేశ్వరరావు ఎంపీటీసీ కందిమళ్ళ రాధా, డివైఎఫ్ఐ మండల అధ్యక్షులు భానోత్ గోపి, ఐద్వా మండల ఉపాధ్యక్షులు గుగులోతు శారద తదితరులు ఉన్నారు.