ప్రజా సమస్యల పరిష్కారం కోసం అధికారులు సహకరించాలి. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య.
Published: Wednesday January 11, 2023
బెల్లంపల్లి జనవరి 10 ప్రజా పాలన ప్రతినిధి: తాండూరు మండలంలో ని వివిధ గ్రామాల్లో ప్రజల సమస్యలను పరిష్కరించడానికి, ప్రజా ప్రతినిధులతో పాటు, అధికారులు కూడా సమన్వయంతో పనిచేయాలని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు.
బుధవారం నియోజకవర్గంలోని తాండూరు మండల ప్రజా పరిషత్ సమావేశం ఎంపీపీ ప్రణయ్ అధ్యక్షతన ఏర్పాటు చేయగా, ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు, రానున్న వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని, త్రాగు నీరు, రోడ్లు, తదితర అత్యవసరమైన పనులు అధికారులు చేపట్టి, త్వరితగతిన పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక జడ్పీటీసీ సాలిగామ బాణయ్య , మండల ఎంపీటీసీలు, సర్పంచ్ లు, ప్రజాప్రతినిధులు, తాసిల్దార్ కవిత , ఎంపిడిఓ , సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: