శ్రీ అనంతపద్మనాభ స్వామి వారిని దర్శించుకున్న లక్నో హైకోర్టు జడ్జి

Published: Monday March 29, 2021
వికారాబాద్ జిల్లా ప్రతినిధి మార్చి 28 ( ప్రజా పాలన ) : శ్రీ అనంత పద్మనాభ స్వామి వారిని లక్నో హైకోర్టు న్యాయమూర్తి సంగీత చంద్ర రమేష్ ఆదివారం దర్శించుకున్నారు. లక్నో హైకోర్టు న్యాయమూర్తి సంగీత చంద్ర రమేష్ త పాటు వికారాబాద్ కోర్టు న్యాయమూర్తి కవితలకు ఆలయ అర్చకులు రాఘవేందర్ వ్యవస్థాపకులు ఎన్.పద్మనాభం, ఈవో శేఖర్ గౌడ్, జూనియర్ అసిస్టెంట్ శాంతు కుమర్ లతో కలిసి పూర్ణకుంభంతో వేద మంత్రోచ్ఛారణలతో ఘన స్వాగతం పలికారు. ఆలయం గర్భగుడిలోకి వెళ్ళి ప్రత్యేక పూజా కైంకర్యాలు నిర్వహించారు. పద్మనాభ స్వామి వారి వైశిష్ఠ్యము ఆలయ అర్చకులు సంక్షిప్తంగా వివరించారు. అనంతగిరి దేవాలయ పరిసర ప్రాంతాలు దివ్య ఔషధాలు నిలయం అన్నారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ మండల రెవెన్యూ అధికారి రవీందర్, వికారాబాద్ పట్టణ సీఐ రాజశేఖర్ పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.