తెలంగాణ ఉద్యమ కళాకారిణి భాగ్యకు ఉచితంగా కంటి చికిత్స

Published: Tuesday August 24, 2021
ఎంపీ రంజిత్ రెడ్డి ఔదార్యం
వికారాబాద్ జిల్లా యువ నాయకులు వడ్ల నందు 
వికారాబాద్ బ్యూరో 23 ఆగస్ట్ ప్రజాపాలన : ఉద్యమ కళాకారిణి భాగ్యకు కంటి శస్త్ర చికిత్సతో పాటు సాంస్కృతిక సారథిలో చేవెళ్ళ ఎంపి గడ్డం రంజిత్ రెడ్డి ఉద్యోగం కల్పించారని వికారాబాద్ జిల్లా యువ నాయకులు వడ్ల నందు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎంపీ సేవా తత్పరతనుు పలువురు ప్రశంసిస్తున్నారని గుర్తు చేశారు. వికారాబాద్ జిల్లా ధారూర్ మండలం గడ్డమీది గంగారం గ్రామానికి చెందిన తెలంగాణ ఉద్యమకారిణి, రాష్ట్ర సాధనలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా కాళ్లకు గజ్జె కట్టి, తన గొంతు ద్వారా అనేక పాటలు పాడి ప్రజలను ఉద్యమ ఉద్యుక్తులను చేశారు. గాయకురాలు భాగ్య కు చేవెళ్ల ఎంపీ డాక్టర్ జి.రంజిత్ రెడ్డి అండగా నిలిచారు. ఆమెకు కంటి శస్త్ర చికిత్స చేయిస్తామని హామీ ఇచ్చారు. వికారాబాద్ జిల్లా పర్యటనలో ఉన్న ఎంపీ రంజిత్ రెడ్డిని సోమవారం వికారాబాద్ జిల్లా యువ నాయకులు వడ్ల నందు ఆధ్వర్యంలో భాగ్య కలిశారు. తనకు కంటి శస్త్ర చికిత్సతో పాటు సాంస్కృతిక సారథిలో ఉద్యోగం ఇప్పించాలంటూ విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఎంపీ రంజిత్ రెడ్డి స్పందిస్తూ, బాగ్యకు ఉచితంగా కంటి శస్త్ర చికిత్స చేయిస్తానని అన్నారు. హాస్పిటల్ సిబ్బంది తో ఫోన్ లో మాట్లాడారు. "ఆరోగ్యం మెరుగైన తర్వాత ఉద్యోగ విషయమై సాంస్కృతిక శాఖ విభాగంతో మాట్లాడి ఉద్యోగం ఇప్పించే ప్రయత్నం చేస్తానని చెప్పారు. దీంతో భాగ్య కన్నీటి పర్యంతం అయింది. తన పట్ల ఎంపీ రంజిత్ రెడ్డి చూపిన ఔదార్యానికి కృతజ్ఞతలు తెలిపింది. సార్.. మీరు నా లాంటి వారి పట్ల ఇంతిటి సహాయం చేయడానికి ముందుకు రావడం పట్ల ధన్యవాదాలు తెలిపింది. అలా అనొద్దు తల్లి...! మీలాంటి కళాకారుల కష్టం, సేవ తెలంగాణ ఉద్యమ సమయంలో మరువలేనివని పేర్కొన్నారు. మీలాంటి వారికి నా వంతు సహాయం చేయడం బాధ్యత గా భావిస్తానుని చెప్పడంతో అక్కడికి వచ్చిన స్థానిక యువకులు.. జై తెలంగాణ జై కేసీఆర్ జై రంజిత్ అన్న అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.