పులుమద్ది టిఆర్ఎస్ కార్యకర్త భాస్కర్ ను పరామర్శించిన ఎమ్మెల్యే

Published: Wednesday February 17, 2021
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 16 ( ప్రజాపాలన ) : అనారోగ్యానికి గురై మెడిక్యూర్ ఆసుపత్రిలో వైద్య చికిత్స పొందుతున్న పులుమద్ది గ్రామానికి చెందిన భాస్కర్ ను మంగళవారం ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ పరామర్శించారు. వైద్యులైన ఎమ్మెల్యే భాస్కర్ ఆరోగ్య పరిస్థితిని ఆసుపత్రి వైద్యులతో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. మంచి వైద్యం అందించాలని ఆసుపత్రి వైద్యులను కోరారు. భాస్కర్ ఆరోగ్యం త్వరగా మెరుగు పడాలని ఆకాక్షించారు. తదనంతరం భాస్కర్  కుటుంబ సభ్యులతో మాట్లాడిన ఎమ్మెల్యే వారికి మనోధైర్యాన్ని ఇచ్చారు. ఎమ్మెల్యేతో పాటు వికారాబాద్ మండల పార్టీ అధ్యక్షుడు నారెగూడెం కమాల్ రెడ్డి, రైతు బంధు అధ్యక్షుడు వెంకటయ్య,  ఏఎంసి చైర్మన్ విజయ్ కుమార్, సర్పంచుల సంఘం అధ్యక్షుడు పురుషోత్తం రెడ్డి, పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి, నాయకులు నర్సింహా రెడ్డి, రాం రెడ్డి తదితరులు పాల్గొన్నారు.