సోమగూడెం లో పోచమ్మ తల్లి విగ్రహాల పునః ప్రతిష్టాపన

Published: Wednesday April 27, 2022
ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య
బెల్లంపల్లి ఏప్రిల్ 26 ప్రజాపాలన ప్రతినిధి: బెల్లంపల్లి నియోజకవర్గం లోని బెల్లంపల్లి మండలం, సోమగూడెం గ్రామంలో, మంగళవారం నాడు పోషమ్మ తల్లి విగ్రహాల పునఃప్రతిష్టాపన కార్యక్రమంలో, ముఖ్యఅతిథిగా హాజరై ప్రత్యేక పూజలు చేసిన  బెల్లంపల్లి ఎమ్మెల్యే  దుర్గం చిన్నయ్య. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాలుగు రహదారుల  నిర్మాణంలో పోతున్న దేవాలయం ఎంతో పురాతనమైన దనీ, పురాతన పోచమ్మ తల్లి దేవాలయం పోతున్న సందర్భంగా కొత్త దేవాలయ ఏర్పాటుకు సహకరిస్తున్న సోమగూడెం ప్రజలందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. గుడి నిర్మాణంలో తన వంతుగా సహాయ సహకారాలు అందిస్తానని అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా జడ్పీ వైస్ చైర్మన్, టి.సత్యనారాయణ, ఎంపీపీ గోమాస శ్రీనివాస్, గ్రామ సర్పంచ్ ప్రమీల గౌడ్, మండల ఎంపీటీసీలు, సర్పంచ్ లు, ఇతర ప్రజాప్రతినిధులు, తెరాస నాయకులు, తదితరులు పాల్గొన్నారు.