ఇబ్రహీంపట్నం డిసెంబర్ తేదీ 28 ప్రజాపాలన ప్రతినిధి *రాష్ట్రంలో ప్రతీ కులాలకు న్యాయం చేసిన ప్ర

Published: Thursday December 29, 2022
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని వైష్ణవీ గార్డెన్స్ లో నియోజకవర్గ క్రైస్తవ సమ్మేళనం కార్యక్రమానికి  హాజరైన  ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి  జిల్లా గ్రాధలయ శాఖ చైర్మన్ సత్తు వెంకట రమణ రెడ్డి, నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షులు జెర్కొని రాజు, నియోజకవర్గ కన్వీనర్ చెరుకూరి రాజు,పాస్టర్లు పాల్గొన్నారు. అనంతరం పాస్టర్లకు బట్టల పంపిణి చేసిన ఎమ్మెల్యే మంచి రెడ్డి కిషన్ రెడ్డి ఆయన మాట్లాడుతు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నీ కులల వారికి న్యాయం చేస్తుందని  ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకాలను ప్రతీ ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని ముఖ్యంగా క్రైస్తవులకు ప్రతీ క్రిస్ మాస్ పండగకి  అందరిని ఒక్కే చోట చేర్చి బట్టలు పంపిణి చేస్తుందని.  అంతేకకుండా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని క్రైస్తవులకు ఇబ్రహీంపట్నం మున్సిపల్ లో ఐదు ఎకరాల భూమి ఇచ్చానని. త్వరలో ఇంటి స్థలం ఉన్నా నిరుపేద కైస్తవులకు మూడు లక్షల రూపాయల పథకం అందజేస్తామని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో పాస్టర్ సుందర్, జై రాజు, కర్ణాకర్ కృస్టాపర్, రవి కుమార్, జయ కుమార్, నాన్ నాయక్, అజేయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు,