అశ్వాపురంలో పోలీసు అమరవీరుల వారోత్సవాల్లో పాల్గొన్న సముద్రాలు జితేందర్. అశ్వాపురం ( ప్రజా ప

Published: Thursday October 27, 2022

 అమరవీరుల వారోత్సవాలలో భాగంగా మణుగూరు లో జరుగుతున్న బైక్ ర్యాలీకి అశ్వాపురం ఎస్ ఐ లు సముద్రాల జితేందర్, నాగుల్ మీరా ఆధ్వర్యంలో యువకులు స్వచ్ఛందంగా బుధవారం బైక్ ర్యాలీకి బయలుదేరారు. ఈ సందర్భంగా ఎస్సై జితేందర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, హెల్మెట్ ధరించి మీ ప్రాణాలే కాకుండా మీ మీదే ఆశలు పెట్టుకున్నటువంటి మీ కుటుంబానికి కూడా హెల్మెట్ శ్రీరామరక్ష కావాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో గద్దల రామకృష్ణ, ఎస్కే నయీమ్, ఈసంపల్లి కృష్ణ, జూపల్లి కిరణ్, పోడియం అనిల్  స్వచ్ఛందంగా యువకులు  భారీ ఎత్తున పాల్గొన్నారు.