కస్నా నాయక్ విగ్రహావిష్కరణ*పలువురు ప్రముఖుల హాజరు
Published: Saturday June 11, 2022
మధిర రూరల్ జూన్ 10 ప్రజా పాలన ప్రతినిధిమండలంలోని వంగవీడు గ్రామంలో ఏర్పాటుచేసిన ఆ గ్రామ మాజీ సర్పంచ్ కస్నా నాయక్ విగ్రహాన్ని వారి మాతృమూర్తి మోతి చేతులు మీదుగా శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కస్నా నాయక్ గ్రామ అభివృద్ధి కోసం ఎనలేని కృషి చేశారని ఆమె గుర్తు చేశారు. కస్నా అనేక పదవులు చేపట్టి అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం కృషి చేశారన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బొగ్గుల పద్మావతి అయిలూరి సత్యనారాయణ రెడ్డి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చిత్తారు నాగేశ్వరరావు ఆత్మ కమిటీ చైర్మన్ రంగిశెట్టి కోటేశ్వరావు మొండితోక జయకర్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు సూరంశేట్టి కిషోర్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రంగా హనుమంత రావు దారా బాలరాజు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
Share this on your social network: