ఆర్థిక సహాయం అందజేత

Published: Wednesday February 17, 2021

వలిగొండ ప్రజాపాలన: మండల పరిదిలోని వెల్వర్తి గ్రామానికి చెందిన ఇంజమూరి ఎల్లయ్య ఇటీవల అనారోగ్యానికి గురై మంగళవారం మృతి చెందడంతో పైళ్ల ఫౌండేషన్ ద్వారా మంజూరైన 5 వేల రూపాయలు మరియు గ్రామ సర్పంచ్ పసల అన్నామేరి శౌరి సౌజన్యంతో 5 వేల రూపాయలు మృతుని కుటుంబ సభ్యులకు టిఆర్ఎస్ నాయకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిటిసి గుండు శేఖర్, గ్రామ శాఖ అధ్యక్షులు కలుకూరి రాములు నాయకులు పాపయ్య తదితరులు పాల్గొన్నారు.