పంట కల్లాల నిర్మాణం పై సమీక్ష సమావేశం

Published: Friday February 11, 2022
ముఖ్యఅతిథిగా సహాయ వ్యవసాయ సంచాలకులు కొంగర వెంకటేశ్వరరావు
బోనకల్, ఫిబ్రవరి 10 ప్రజాపాలన ప్రతినిధి: మండల కేంద్రంలో గల మండల పరిషత్ కార్యాలయం నందు ఎంపీడీవో గొట్టిపాటి శ్రీదేవి అధ్యక్షతన, సహాయ వ్యవసాయ సంచాలకులు మధిర కొంగర వెంకటేశ్వరరావు గురువారం పంట కల్లాల నిర్మాణంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మండలంలో మొత్తం 80 మంది రైతులు పంటకల్లాల నిర్మాణం కొరకు దరఖాస్తు చేసుకొని సాంక్షన్ ఇవ్వడం జరిగింది. వీలైనంత త్వరగా ఆ రైతులు కల్లాల నిర్మాణం పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులు దిశ నిర్ధేశం చేశారు. పంటకల్లాల నిర్మాణం పూర్తయిన తర్వాత మంజూరైన 80 మంది రైతులకు డబ్బులు త్వరగా జమవుతాయని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి శరత్ బాబు, ఈఓఆర్డీ శ్రీనివాసరెడ్డి, ఏపీవో, వ్యవసాయ విస్తరణ అధికారులు, గ్రామ పంచాయతీ సెక్రటరీలు, టెక్నికల్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.