బిజెపి ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం

Published: Thursday January 06, 2022
బోనకల్, జనవరి 5 ప్రజాపాలన ప్రతినిధి: తెలంగాణ ఉద్యోగుల పాలిట శాపంగా మారినటువంటి 317 జీవో ను సవరించాలని తెలంగాణ బిజెపి పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ చేస్తున్నటువంటి జాగరణ దీక్షను భగ్నం చేయడమే కాకుండా అక్రమ కేసులు బనాయించి 14 రోజులపాటు రిమాండ్లో ఉంచినా తీరుని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. వెంటనే 317 జీవోను సవరిస్తూ బండి సంజయ్ బేషరతుగా విడుదల చేయాలని నిరసన తెలియచేస్తూ, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు మరియు జిల్లా అధ్యక్షులు గల్లా సత్యనారాయణ ఆదేశాల మేరకు బుధవారం బోనకల్ మండల కేంద్రంలో ప్రభుత్వ కళాశాల ఆవరణలో స్వచ్ఛభారత్ కార్యక్రమం నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు గుగులోత్ నాగేశ్వరరావు, యువమోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు కారంగుల మురళీకృష్ణ, బోనకల్ మండల బీజేపీ అధ్యక్షుడు విరపనేని అప్పారావు, బీజేవైఎం మండల అధ్యక్షుడు కాలసాని పరశురామ్, ఓబీసీ మండల ప్రధాన కార్యదర్శి మరీదు పరశురాముడు, గిరిజిన మోర్చా మండల అధ్యక్షుడు భూక్యా సైదా తదితరులు పాల్గొన్నారు.