సిపిఐ మండల, 15వ మహాసభ జయప్రదం చేయండి -సిపిఐ మండల కార్యదర్శి యంగల ఆనంద్ రావు, సమితి సభ్యులు తూము

Published: Friday July 08, 2022
బోనకల్, జులై 8 ప్రజా పాలన ప్రతినిధి: 96 వసంతాలు పూర్తి చేసుకున్న భారత కమ్యూనిస్టు పార్టీ మండల 15వ మహాసభ చింతపట్ల గోపయ్య నగర్ (రాపల్లి గ్రామం) లో జూలై 9న జరుగే సిపిఐ మండల మహాసభను విజయవంతం చేయాలని సిపిఐ మండల కార్యదర్శి యంగల ఆనందరావు, జిల్లా సమితి సభ్యులు తూము రోషన్ కుమార్ పిలుపునిచ్చారు . మండలంలోని ముష్టికుంట్ల రాయన్నపేట గ్రామ శాఖల మహాసభలను గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాటి నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా గల మెత్తిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో కీలక పాత్ర పోషించిన గ్రామం ఈ రాపల్లి ఒకటని వుగు, కమ్యూనిస్టు ఉద్యమానికి మొదటి నుండి బాసటగా నిలిచిన ప్రాంతం, కమ్యూనిస్టు యోధులు కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య, కామ్రేడ్ చండ్ర రాజేశ్వరరావు లాంటి మహనీయులు నడయాడిన ప్రాంతమని, ఎన్నో ఉ ద్యమాలకు కేంద్రమైన ఈ గ్రామంలో భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన భూ పోరాటాలు సర్వే నెంబర్ 144, 440లలో ఎందరో పేద ప్రజలకు భూమిని పంచి పెట్టడం జరిగిందన్నారు. ప్రస్తుత పాలకులు ప్రజా సంక్షేమం కోసం కాకుండా కార్పొరేటర్ సంస్థల కోసం పనిచేస్తున్నారన్నది అక్షర సత్యమన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలైన విమానయానం, రైల్వేలు, నౌకాశ్రయాలు చివరకు రోడ్ల తో సహా కార్పొరేట్ శక్తులకు అమ్మేస్తున్నారని విమర్శించారు. పేదల సంక్షేమం కోసం పాటుపడతానని అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ పేదల గురించి ఒక నిమిషం కూడా ఆలోచించకుండా అనునిత్యం కార్పొరేట్ సంస్థల మెప్పు కోసం పనిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలోని సంక్షోభాన్ని ప్రజలకు తెలియకుండా ఉండడానికి మతం పేరుతో విద్వేషాలు రెచ్చగొడుతున్నారని, రాష్ట్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన కెసిఆర్ 2018 లో ఇచ్చిన ఎన్నికల హామీలను ఇంతవరకు నెరవేర్చలేదని పేర్కొన్నారు. . దేశంలో, రాష్ట్రంలో పేదరికం, నిరుద్యోగం నానాటికీ పెరిగిపోతున్నాయని, ఈ తరుణంలోనే దేశానికి కమ్యూనిస్టుల అవసరం ఉన్నదని , భారత కమ్యూనిస్టు పార్టీ 15వ మండల మహాసభను జూలై 9న శనివారం రోజున చింతపట్ల గోపయ్య ప్రాంగణం (రాపల్లి)లో నిర్వహిస్తున్నామన్నారు. ఈ మండల మహాసభలో రాష్ట్ర , జిల్లా నాయకులు పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో మండల సహాయ కార్యదర్శి జక్కుల రామారావు, సిపిఐ సీనియర్ నాయకులు జక్కా నాగ భూషణం, ఆకెన పవన్, బొడ్డుపల్లి వెంకటేశ్వర్లు, సుశీల తదితరులు పాల్గొన్నారు.