శేరిలింగంపల్లి/ ప్రజా పాలన -జూలై 15;

Published: Saturday July 16, 2022

శేరిలింగంపల్లి డివిజన్ రాజీవ్ స్వగృహ ఆరంభ టౌన్షిప్ కు ఇవ్వవలసిన ఆక్యుఫెన్సీ సర్టిఫికెట్ గత పది సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్న దాన్ని రాజీవ్ స్వగృహ ఆరంభ టౌన్షిప్ వారు కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ దృష్టికి తీసుకురాగా కార్పొరేటర్ శేరిలింగంపల్లి శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ అరికెపూడి గాంధీతో కలిసి మంత్రివర్యులు కల్వకుంట్ల తారక రామారావుతో మాట్లాడి ఆక్యుఫెన్సీ సర్టిఫికెట్ ను రాజీవ్ స్వగృహ ఆరంభ టౌన్షిప్ వారికి జిహెచ్ఎంసి జోనల్ కమిషనర్ చేతుల మీదుగా ఇప్పించడం జరిగింది. అందుకుగాను సంతోషాన్ని వ్యక్తం చేస్తూ కార్పొరేటర్ ను, ఎమ్మెల్యేను రాజీవ్ స్వగృహ ఆరంభ టౌన్షిప్ వారు ఘనంగా శాలువాతో సన్మానించారు. కార్పొరేటర్ కు, ఎమ్మెల్యేకు, మంత్రి కేటీఆర్ కు జోనల్ కమిషనర్ కు రాజీవ్ స్వగృహ ఆరంభ టౌన్షిప్ వారు కృతజ్ఞతాభివందనాలు తెలిపినారు. ఈ కార్యక్రమంలో డివిజన్ దుర్గం వీరేశం గౌడ్, ఆరంభట్ట్ టౌన్షిప్ టిఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ రవీంద్ర రాథోడ్, అరుణ శ్రీ, రెహానా, నరేంద్ర కుమార్, నరసింహులు, జనార్ధన్, బసవయ్య, రాజేశ్వరరావు, ప్రవీణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.