అఖిల భారత మహాసభలను విజయవంతం చేయండి* -పోస్టర్ ఆవిష్కరించిన డివిజన్ అధ్యక్షులు అరుణ్ కుమార్ శ
Published: Wednesday December 07, 2022
చేవెళ్ల డిసెంబరు 6, (ప్రజా పాలన):-
చేవెళ్ల నియోజవర్గం శంకర్పల్లి మండల కేంద్రంలో ఎస్ఎఫ్ఐ అఖిలభారత మహాసభల పోస్టర్లను చేవెళ్ల డివిజన్ అధ్యక్షులు కార్యదర్శులు అరుణ్ కుమార్,శ్రీనివాస్,ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా అరుణ్ కుమార్ శ్రీనివాస్ మాట్లాడుతూ ఎస్ఎఫ్ఐ 17వ అఖిలభారత మహాసభలు ఈనెల 13 నుండి 16 వరకు హైదరాబాద్ నగరంలో ఉద్యమాలకు పురిటిగడ్డ అయినా ఉస్మానియా యూనివర్సిటీ ఠాగూర్ ఆడిటోరియంలో జరుగుతున్నాయి 2005 సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో అత్యంత జయప్రదంగా గత మహాసభ జరుపుకున్నాం. 17 సంవత్సరాల తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం మొట్టమొదటిసారిగా 17 అఖిలభారత మహాసభలు హైదరాబాద్ నగరంలో జరగబోతున్నాయి. ఈ మహాసభలకు ముఖ్య అతిథిగా త్రిపుర మాజీ ముఖ్యమంత్రి కామ్రేడ్ మాణిక్ సర్కార్ ఎస్ఎఫ్ఐ జాతీయ అధ్యక్షులు విపి సాను ఎస్ఎఫ్ఐ జాతీయ ప్రధాన కార్యదర్శి మరియు విశ్వాస్ ఎస్ఎఫ్ఐ జాతీయ గర్ల్స్ కన్వీనర్ దీప్సితాదార్ చాలా మంది జాతీయ నాయకులు అన్ని రాష్ట్రాల ప్రతినిధులు ఈ మహాసభలకు హాజరవుతారని అన్నారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ శంకర్పల్లి మండల నాయకులు రాహుల్ వికాస్ తదితరులు పాల్గొన్నారు
Share this on your social network: