గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి
Published: Tuesday January 10, 2023
జన్నారం, జనవరి 9, ప్రజాపాలన: మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పందెన అశోక్ (25) ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతి చెందినట్లు జన్నారం ఎస్ ఐ సతీష్ తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మృతి చెందిన వ్యక్తికి భార్య పందెన గాంగమని
కుమారుడు శివ (2)
కుమార్తె సాహీతి(5) ఉన్నారు. మృతి చెందిన
అశోక్ కూలీ పని కుటుంబాన్ని పోషించుకునేవారన్నారు. మృతి చెందిన వ్యక్తితో పాటు అతని స్నేహితులు వెంకటేష్ ప్రవీణులకు గాయాలవడంతో మంచిర్యాల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు ఆయన తెలిపారు.
Share this on your social network: