మల్లారం గ్రామంలో కరోనా తీవ్రంగా వ్యాప్తి చెందుతోందిమందడపు ఉపేంద్రసర్పంచ్ మల్లారం

Published: Wednesday June 23, 2021
మధిర ప్రజాపాలన ప్రతినిధి 22వ తేదీ మధిర మండలం మల్లారం గ్రామంఇటీవల కాలంలో ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభణలో భాగంగా మల్లారం గ్రామంలో కూడా కరోనా ప్రభావం ఏర్పడింది గ్రామపంచాయతీ పరిధిలో పరిశుభ్రత కార్యక్రమాలు సామాజిక దూరం సేవా కార్యక్రమాల ద్వారా కరోనా ను అదుపులోకి తేవడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు కరోనా తో చనిపోయిన వారిని గ్రామాల్లో ఊరేగింపు చేస్తూ సభలు నిర్వహించడం ద్వారా చుట్టుపక్కల గ్రామాలలో కరోనా ప్రభావం తగ్గిన మల్లారంలో మాత్రం తిరిగి పుంజుకుంటోందని సర్పంచ్ మందడపు ఉపేంద్ర తెలియజేశారు. కష్టకాలంలో ప్రజలకు ధైర్యం ఇవ్వాల్సింది పోయి కొన్ని రాజకీయ పార్టీలు శవ రాజకీయాలు చేయడం దురదృష్టకరమని అన్నారు. వైద్య అధికారులు పోలీసు వారు స్పందించి గ్రామంలో కరోనా టెస్ట్ నిర్వహించి అవసరమైన మందులు సరఫరా చేయాలని కరోనా తో చనిపోయిన శవాల ఊరేగింపులు సభలు మీటింగ్లు జరక్కుండా పోలీసు వారు చూడాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు