కుటుంబ పాలనకు చమరగీతం పాడండి : బిజెపి నాయకులు వివేక్ వెంకటస్వామి

Published: Friday July 02, 2021

జన్నారం, జూలై 1, ప్రజాపాలన ప్రతినిధి : రాష్ట్రంలో కొనసాగుతున్న కుటుంబ పాలనకు చమరగీతం పాడాలంటే బిజెపి నాయకులు వివేక్ వెంకటస్వామి పిలుపునిచ్చారు, శుక్రవారం మండలంలోని పైడిపల్లి ఫంక్షన్ హాల్ లో ఏర్పాటుచేసిన బిజెపిలో చేరికలు ఈ కార్యక్రమానికి హాజరై ఆయన మాట్లాడారు. తెలంగాణ వస్తే  ఇంటికొక ఉద్యోగం వస్తుందని దళితున్ని తొలి ముఖ్యమంత్రి చేస్తానని ముఖ్యమంత్రి కెసిఆర్ హామీలు గుప్పించారు, తెలంగాణ వచ్చిన తర్వాత వాటన్నింటిని మర్చిపోయి కుటుంబ శ్రేయస్సు కొరకు పాటుపడుతూ కుటుంబ పాలన కొనసాగిస్తున్నారని విమర్శించారు, కేటీఆర్ కుమారుడికి వయస్సు ఉన్నట్లయితే ఆయనకు కూడా ఒక పదవిని కట్టబెట్టే వారని బిజెపి అధ్యక్షులు ఎర్రబెల్లి రఘునందన్ రావు విమర్శించారు, తాను ప్రజల పక్షాన ఎల్లప్పుడూ పోరాడుతూనే ఉంటానని తనను ఆశీర్వదించాలని ఆదిలాబాద్ మాజీ ఎంపీ బిజెపి నాయకులు రాథోడ్ రమేష్ కార్యకర్తలను కోరారు  ప్రజల ఇష్టం మేరకే తాను బిజెపి లో చేరాను, నాకు అందరూ మద్దతు ఇవ్వాలని కోరారు, బీజేపీలో చేరిన వారిలో మాజీ జెడ్పిటిసి రంకల హనుమాన్లు, ప్రస్తుత ఎంపీటీసీలు కొంతం శంకరయ్య దర్శనాల వెంకట స్వామి  మధుసూదన్ రావు మాజీ సర్పంచులు బొంతల మల్లేష్ మాజీ ఎంపీటీసీ లు మాజీ సర్పంచులు బిజెపిలో చేరారు.