మండల పరిషత్ సర్వసభ్య సమావేశం

Published: Tuesday June 21, 2022

మధిర జూన్ 20 రూరల్ ప్రజా పాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో సోమవారం నాడు ఎంపీడీవో కార్యాలయంలోమండల పరిషత్ సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా ప్రజా పరిషత్ అధ్యక్షులు లింగాల కమల్ రాజు పల్లెలు పట్టణాలు పంచాయతీలో అభివృద్ధి టిఆర్ఎస్ ప్రభుత్వం ద్వారానే సాధ్యమవుతుందని దానికి నిదర్శనం గౌరవ ముఖ్యమంత్రి  పంచాయతీలకు విడుదల చేస్తున్న నిధులు పల్లె ప్రగతి, వైకుంఠధామం ,ట్రాక్టర్, పల్లె ప్రకృతి వనాలు అనేక కార్యక్రమాల ద్వారా ప్రభుత్వం పెద్ద ఎత్తున పంచాయతీలకు ప్రాధాన్యత ఇస్తుందని ఆయన ప్రభుత్వనీ కొనియాడారు ఈ కార్యక్రమంలో ఎంపీపి మెండం లలితా  మార్కెట్ కమిటీ చైర్మన్ నాగేశ్వరావు  ఆత్మ కమిటీ చైర్మన్ రంగిశెట్టి కోటేశ్వరావు  ఎంపీటీసీలు  సర్పంచులు  ఎంపీడీవో పలు శాఖల అధికారులు మొదలగు వారు పాల్గొన్నారు*