వైభవంగా గ్రంధాలయ సంస్థ చైర్మన్ గొల్లపల్లి చంద్రశేఖర్ గౌడ్ ప్రమాణస్వీకారం : హాజరైన మంత్రి కొ

Published: Wednesday June 16, 2021
జగిత్యాల, జూన్ 15 (ప్రజాపాలన ప్రతినిధి): జగిత్యాల జిల్లా కేంద్రంలోని పద్మనాయక కళ్యాణ మండపంలో అంగరంగా వైభవంగా జగిత్యాల జిల్లా గ్రంధాలయ సంస్థ ఛైర్మన్ గా డా.గొల్లపల్లి చంద్రశేఖర్ గౌడ్ మరియు పాలకవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ ఏ కాంపిటిషన్ ఏజమ్స్ లో విజయం సాధించాలంటే బుక్స్ తప్పకుండ అవసరం బుక్స్ కావాలంటే ఒక గ్రంధాలయంలో మాత్రమే వివిధ రకాలైన ప్రతి బుక్స్ తప్పకుండ ఉంటాయని వాటిని చదివి విజయం సాధించలంటే గ్రంథలయాలకు తప్పకుండ వెళ్లి చదువుకుంటే ఖచ్చితంగా విజయం సాధిస్తరని కవిత అన్నారు. సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ గ్రంధాలయ సంస్థలను బాధ్యయుతగా చేపట్టి అభివృద్ధి దశలో ముందుకు తీసుకువెల్లవాల్సిన బాధ్యత ఛైర్మన్ల పై ఉన్నదని వాటిని అభివృద్ధి దశలో తీసుకువెళ్లాడానికి సీఎం కేసీఆర్ దృఢ సంకల్పంతో ఉన్నారని ఈశ్వర్ అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గ్రంధాలయ సంస్థ చైర్మన్ శ్రీధర్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ గొడిసెల రాజేశం గౌడ్ జడ్పీ చైర్ పర్సన్ దావ వసంతసురేశ్ ఎమ్మెల్యేలు డా.సంజయ్ కుమార్ సుంకే రవిశంకర్ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి మున్సిపల్ ఛైర్ పర్సన్ బోగ శ్రావణి మోర హన్మాండ్లు ఎక్స ఎమ్మెల్యే సత్యనారాయణ గౌడ్ బాపురెడ్డి హరిచరన్ రావు జడ్పీటీసీలు ఎంపిపిలు కౌన్సిలర్లు సర్పంచులు ఎంపీటీసీలు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.