నాగేశ్వరావును ఘనంగా సన్మానించిన ఆర్ పీ ఐ హైదరాబాద్ (ప్రజాపాలన ప్రతినిధి ):

Published: Wednesday March 01, 2023
దివ్యాంగుల హక్కుల కోసం అహర్నిశలు పోరాటం చేసి ఇటీవలే రైల్వే బోర్డు మెంబర్ గా నియమితులైన కొల్లి నాగేశ్వరరావును రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా మంగళవారం ఘనంగా సన్మానించింది.  అమీర్పేటలో ని హోటల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆర్.పీ.ఐ తెలుగు రాష్ట్రాల కన్వీనర్ పేరం శివ నాగేశ్వరరావు గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఓవైపు అంగవైకల్యం, మరోవైపు పేద వర్గాలలో జన్మించిన కొల్లి నాగేశ్వరరావు అంచలంచలుగా ఎదుగుతూ రైల్వే బోర్డు సభ్యుడిగా ఎంపిక కావడం ఎంతో గర్వకారణంగా ఉందని అన్నారు. 
పేద వర్గాలకు తన వంతు సహకారం అందిస్తానని కొల్లి నాగేశ్వరరావు అన్నారు. 
ఎన్నో కష్టాలు ఎదుర్కొన్న తనను గుర్తించి రైల్వే బోర్డు మెంబర్ లో  అవకాశం కల్పించడం ఎంతో సంతోషంగా ఉందని కొల్లి నాగేశ్వరరావు అన్నారు. క్రింది వర్గాల స్థితి గతులు తెలిసిన తాను  ఆయా వర్గాల అభ్యున్నతికి పాటు పడతానని  ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో రత్న ప్రసాద్, మమతా గౌడ్, సురేందర్ గౌడ్, అశోక్ యాదవ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.