ఇబ్రహీంపట్నం జనవరి తేదీ 3 ప్రజాపాలన ప్రతినిధి *చదువుల తల్లి సావిత్రిబాయి పూలే192 జయంతి ఘనంగా

Published: Wednesday January 04, 2023
ఇబ్రహీంపట్నం అసెంబ్లీ మహిళా  కమిటీ ఆధ్వర్యంలో నూకల అనిత మరియు   కంబాలపల్లి రజిని  ఇబ్రహీంపట్నం మండల అధ్యక్షుడు మచ్చ మహేందర్ గార్ల ఆధ్వర్యంలో భారతదేశ తొలి మహిళ ఉపాధ్యాయురాలు అయినటువంటి చదువుల తల్లి సావిత్రిబాయి పూలే గారి 192 వ జయంతి ఉత్సవాలు ఇబ్రహీంపట్నంలో మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. స్త్రీల అభ్యుదయానికి బీజం వేసిన మొదటి తల్లి అమ్మ సావిత్రిబాయి పూలే అనాదిగా వంటింటికే పరిమితమై ఎటువంటి హక్కులు లేని మహిళలకు విద్యతో బీజం వేసి వాళ్ల చేతికి పుస్తకాన్ని అందించి నేడు అన్ని రంగాలలో ఉద్యోగాలలో రాజకీయంలో రంగంలో ముందుండాలని పోరాడిన మొదటి నాయకురాలుగా పేరుందిన మహాతల్లికి నేడు ఘన నివాళులు అర్పించడం జరిగింది .ఇట్టి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఇబ్రహీంపట్నం అసెంబ్లీ ఇంచార్జ్ పల్లాటి రాములు  .మంచాల మండల కన్వీనర్ వంగల కృష్ణ ప్రసాద్  .మంచాల మండల్ మహిళ కన్వీనర్ లాల గారి మనీ  .ఇబ్రహీంపట్నం మునిసిపల్ సీనియర్ నాయకులు కొండ్రు కరుణాకర్  .మునిసిపల్ ఉపాధ్యక్షులు సిహెచ్ కరుణాకర్  .కంబాలపల్లి గణేష్  .గడ్డం సుధాకర్  .గాలి సామెల్ . జీవన్ కుమార్ . మరియు బీఎస్పీ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.