నేటి తెరాస జెండా పండుగని జయప్రదం చేయండి : ఒకటవ వార్డు కౌన్సిలర్ సూరం సంగీత బానేష్

Published: Thursday September 02, 2021
బెల్లంపల్లి సెప్టెంబర్ 1 ప్రజాపాలన ప్రతినిధి : బెల్లంపల్లి మున్సిపాలిటీ ఒకటో వార్డు లో స్థానిక ఫ్లైఓవర్ దగ్గర చేసే తెరాస పతాకావిష్కరణ పండుగకి అందరూ హాజరై జయప్రదం చేయాలని బెల్లంపల్లి మునిసిపల్ ఒకటో వార్డు కౌన్సిలర్ సూరం సంగీత బానేశ్ తెలిపారు. బుధవారం నాడు స్థానిక కౌన్సిలర్ కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కె సి ఆర్ సెప్టెంబర్ 2వ తేదీన ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర సమితి కార్యాలయానికి శంకుస్థాపన చేస్తున్న సందర్భంగా రాష్ట్ర తెరాస పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే టి ఆర్ ఆదేశాల మేరకు సెప్టెంబర్ 2వ తేదీన బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఒకటో వార్డు కన్నాల బస్తి ఫ్లై ఓవర్ బ్రిడ్జి వద్ద ఏర్పాటుచేసిన తెరాస జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి స్థానిక తెరాస పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, హాజరై పార్టీ పతాకావిష్కరణ చేసి జెండా పండుగను ఘనంగా విజయవంతం చేయాలని ఆమే కోరారు. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య చేసిన సూచన మేరకు ఈ జెండా పండుగకు మన పట్టణంలోని వివిధ వార్డుల కౌన్సిలర్లు, చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్, స్థానిక ప్రజా ప్రతినిధులు, ముఖ్య కార్యకర్తలు, అందరూ హాజరవుతున్న అందున, పార్టీ సభ్యత్వం తీసుకున్న ప్రతిఒక్కరూ హాజరు కావాలని ఆమె విజ్ఞప్తి చేసింది. ఈ జెండా పండుగ తర్వాత నూతన కమిటీల ఏర్పాటు ప్రక్రియ ఉంటుందని ఆమె తెలిపారు.