కలప అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా

Published: Monday December 19, 2022
జన్నారం, డిసెంబర్ 18, ప్రజాపాలన: మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కవల్ జోన్ పరిధిలో కడప అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘ ఏర్పాటు చేయడం జరిగిందని ఆదివారం జన్నారం ఎఫ్ ఆర్ వో ఉద్దీన్ అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కవ్వాల్ టైగర్ జోన్ లోని జన్నారం ఆటో విజన్ లోని అడవిలో ఉన్న బేసిక్ క్యాంప్ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశామన్నారు. మండలంలోని కవ్వాల్ టైగర్ జోన్ లో ఉన్న జంతువులపై ప్రత్యేక నిల ఏర్పాటు చేయాలన్నారు. మండలంలోని కవ్వాల్ అటవీలో కలప స్మగ్గర్లపై ఉక్కు పాదం మోపమని తెలియజేశారు. మండలంలోని కవ్వల్ అడవిని రక్షించాలన్నారు.