ప్రియాంక గాంధీ అరెస్టుకు తెలంగాణలో నిరసన సెగలు

Published: Wednesday October 06, 2021
హైదరాబాద్, అక్టోబర్ 4, ప్రజాపాలన ప్రతినిధి : మరణించిన రైతు కుటుంబాలను పరామర్శించడానికి వెలుతున్న ప్రియాంక గాంధీని సీతాపూర్ లో ఉత్తర ప్రదేశ్ పోలీసులు అరెస్టు చేయడాన్ని తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ తీవ్రంగా ఖండిచారు. ఉత్తర ప్రదేశ్ లో ప్రియాంక గాంధీ అరెస్టుకు నిరసనగా తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో  సోమవారం నాడు హైదరాబాదులో పెద్ద ఎత్తున నిరసన మరియు ధర్నా కార్యక్రమాలు చేపట్టారు. రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీత రావు, ఇంచార్జీ కోఆర్డినేటర్ మరియు యాదాద్రి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నీలం పద్మ వెంకటస్వామి, వరలక్ష్మీ, మస్రత్ షబానా, ప్రభా లక్ష్మి మరియు వివిధ జిల్లాల నుంచి మహిళా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అధిక పాల్గొన్నారు.