*అన్ని దానాల కంటే అన్నదానం మిన్న

Published: Monday September 12, 2022

మధిర  సెప్టెంబర్ 11 ప్రజా పాలన ప్రతినిధి అన్ని దానాల కంటే అన్నదానం మిన్న అని ఆర్యవైశ్య సంఘం నాయకులు రంగా వెంకటేశ్వర్లు రంగా హనుమంతరావు రంగా అప్పారావు  అన్నారు. ఆదివారం మర్లపాడు గ్రామంలో ఏర్పాటు చేసిన అన్నదానాన్ని వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదవాడి ఆకలి తీర్చే విధంగా అన్నదానాలు ఏర్పాటు చేయటం అభినందనీయం అన్నారు. ప్రతి ఒక్కరూ సేవా కార్యక్రమంలో పాల్గొనాలని ఈ సందర్భంగా వారు కోరారు. ఆడంబరాలకు మితిమీరి ఖర్చులు చేయకుండా పేదల ఆకలి తీర్చే విధంగా అన్నదానాలు ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా వారు కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి సూరం శెట్టి నాగభూషణం మండల కాంగ్రెస్ అధ్యక్షులు సూరం శెట్టి కిషోర్ డాక్టర్ సూరం శెట్టి మోహన్ బాబు సర్పంచ్ పులి బండ్ల చిట్టిబాబు భక్తులు పాల్గొన్నారు.