రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవానికి తరలివెళ్లిన మెట్ పల్లి కాంగ్రెస్ నాయకులు

Published: Thursday July 08, 2021
మెట్ పల్లి, జూలై 07 (ప్రజాపాలన ప్రతినిధి) : తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ గా మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యేందుకు మెట్ పల్లి నుంచి కాంగ్రెస్ నాయకులు హైదరాబాద్ తరలివెళ్లారు. కాంగ్రెస్ పార్టీ మెట్ పల్లి పట్టణాధ్యక్షుడు మహ్మద్ ఖుతుబొద్దిన్ పాషా ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనాల ద్వారా నినాదాలు చేసుకుంటూ తరలివెళ్లారు. హైదరాబాద్ కు తరలి వెళ్లిన వారిలో మాజీ సర్పంచ్ కొమిరెడ్డి లింగారెడ్డి, నాయకులు అవేజ్, హరీష్, అరుణ్ తదితరులు ఉన్నారు.