వైద్య శిబిరాన్ని ప్రారంభించిన సర్పంచ్ బద్దం నిర్మల..

Published: Friday July 15, 2022
తల్లాడ, జులై 14 (ప్రజాపాలన న్యూస్):
తల్లాడ మండలంలోని కొడవటిమెట్ట (రెడ్డిగూడెం) గ్రామంలో ఆయుష్ విభాగం ఆధ్వర్యంలో గురువారం ఉచిత హోమియో వైద్య శిబిరం నిర్వహించారు. ఈ హెల్త్ క్యాంపును గ్రామ సర్పంచ్ బద్ధం నిర్మల ప్రారంభించారు. తల్లాడ హోమియో వైద్యులు డాక్టర్ నీలిమ, డాక్టర్ శ్రీనివాస్ నాయక్, డాక్టర్ శిల్ప రోగులను పరీక్షించి మందులను పంపిణీ చేశారు. దీర్ఘకాలిక వ్యాధులు, సీజనల్ వ్యాధులకు సంబంధించి మందులను పంపిణీ చేశారు. అనంతరం సర్పంచ్ నిర్మల మాట్లాడుతూ గ్రామంలో ప్రతి ఒక్కరు పరిశుభ్రతను పాటించాలని, నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని సూచించారు. గ్రామస్తులు ఈ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.  ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం, గ్రామ కార్యదర్శి, టిఆర్ఎస్ నాయకులు బద్దం కోటిరెడ్డి, స్థానిక వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
 
 
 
Attachments area