చనిపోయిన అంగన్వాడీ టీచర్ రమాదేవి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని అంగన్వాడి యూనియన్ జిల్ల
Published: Thursday July 07, 2022
జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి
కరీంనగర్ జూలై 6 ప్రజా పాలన :
మాజీ ఉప ప్రధాని, సంఘసంస్కర్త బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా నగర ఎస్ సి సెల్ అధ్యక్షుడు లింగంపెల్లి బాబు ఆధ్వర్యంలో నగరంలోని మంచిర్యాల్ చౌరస్తా వద్దగల జగ్జీవన్ విగ్రహానికి బుధవారం నాడు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఈ సందర్బంగా మాట్లాడుతూ జగ్జీవన్ రామ్ స్వతంత్ర సంగ్రామంలో పాల్గొనడమే కాకుండా ఉత్తమ పార్లమెంటేరియన్ గానూ, యాభై సంవత్సరాలు నిరంతరాయంగా పార్లమెంటుసభ్యులుగా కేంద్రంలో పలు కీలకశాఖలకు మంత్రిగా దేశ ఉపప్రధానిగా సేవలందించిన ఘనత జగ్జీవన్ రామ్ కు దక్కిందని కొనియాడారు. ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కంకణ బద్దులై కృషి చేయాలని పిలుపునిచ్చారు, ఈ కార్యక్రమంలో జీ డి రమేష్, దండి రవీందర్, గుండాటి శ్రీనివాస్ రెడ్డి,కుర్ర పోచయ్య,కొరివి అరుణ్ కుమార్, ముక్క భాస్కర్, మామిడి సత్యనారాయణ రెడ్డి,సలీమొద్దిన్,మేడి మహేష్, జిలకర రమేష్,అజ్మత్ తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: