8వ డివిజన్ లో బాబు జగ్జీవన్ రావ్ జయంతి వేడుకలు

Published: Tuesday April 06, 2021

బాలాపూర్: (ప్రతినిధి) ప్రజా పాలన : స్థానిక కార్పొరేటర్ గుడేపు ఇంద్రసేన నిరుపేదలకు బాబు జగ్జీవన్ రావ్ జయంతి సందర్భంగా పండ్లు పంచిపెట్టారు. బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ని నాదరుగుల్ 8వ డివిజన్ లో అంబేద్కర్ నగర్ లో బాబు జగ్జీవన్ రాం గారి 113 వ జయంతి వేడుకలు కార్పొరేటర్ గుడెపు ఇంద్రసేన ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి పండ్లు పంచడం జరిగింది. వారు చేసిన గొప్ప గొప్ప విషయాలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ల్ తోట శ్రీధర్ రెడ్డి, నిమ్మల సునీత శ్రీకాంత్ గౌడ్, మున్సిపల్ కార్పోరేషన్ బీజేపీ అధ్యక్షుడు చేరకుపల్లి వెంకట్ రెడ్డి, బీజేపీ నాయకులు వంక ప్రభాకర్, వంశి, కె రవి, మెకం దర్శన్, మెకం రమేష్, చిత్రం కృష్ణ, చిత్రం నరేష్, వంక ఉపేందర్ తదితర బీజేపీ నాయకులు పాల్గొన్నారు.