టిఆర్ఎస్ పాలనలోనే పేద ప్రజలకు సంక్షేమ పథకాలు

Published: Tuesday February 16, 2021
వలిగొండ ప్రజాపాలన: టిఆర్ఎస్ ప్రభుత్వ పాలనలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా పేద ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అమలౌతున్నాయని టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు డేగల పాండు యాదవ్ అన్నారు.సోమవారం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఆయన చేతుల మీదుగా వలిగొండ పీఏసీఎస్ చైర్మన్ సురకంటి వెంకట్ రెడ్డికి మొదటి సభ్యత్వం అందజేసి మాట్లాడుతూ దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా పేద ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు టిఆర్ఎస్ ప్రభుత్వం అందజేస్తుందని,దానికి ఆకర్షితులై పార్టీలో పెద్ద ఎత్తున సభ్యత్వాలు స్వీకరిస్తున్నారని అన్నారు.అనంతరం మండలంలోని వివిధ గ్రామాల్లో గ్రామశాఖ అధ్యక్షులు పార్టీ సభ్యత్వాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మల్లారెడ్డి, సలీం, స్వామి, మహేష్, బాలేశ్వర్, ఆశయ్య, లింగస్వామి, బాలరాజు తదితరులు పాల్గొన్నారు.