గుర్తు తెలియని వ్యక్తి మోరంగపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో మృతి
Published: Tuesday September 13, 2022
వికారాబాద్ స్టేషన్ హౌస్ ఆఫీసర్
వికారాబాద్ బ్యూరో 12 సెప్టెంబర్ ప్రజా పాలన : గుర్తు తెలియని వ్యక్తి సదాశివపేట రోడ్డు రైల్వే స్టేషన్ ( మొరంగపల్లి ) వద్ద కిలోమీటర్ నంబర్ 21/12-13 మధ్యన ఏదో గుర్తు తెలియని రైలు క్రిందపడి చనిపోయాడని వికారాబాద్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. సంఘటన స్థలంలో మృతుని చిరునామాకు సంబంధించిన ఎలాంటి ఆధారాలు లభించలేదని పేర్కొన్నారు.
మృతుని యొక్క వయస్సు సుమారుగా 25 సంవత్సరాలు ఉండవచ్చని అంచనా వేశారు. చనిపోయిన వ్యక్తి చామన ఛాయ, కోల ముఖం కలిగి ఉన్నాడు. కొద్దిగా గడ్డం కలదు. ఎత్తు 5'.5" అంగుళాలు. చనిపోయిన వ్యక్తి బ్లూ కలర్ నైట్ ఫ్యాంట్. చాక్లెట్ రంగు టీ షర్ట్ ధరించి ఉన్నాడు .
మృతుని యొక్క మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రి, మార్చురి నందు భద్రపరచడం జరిగినది. ఇట్టి సంఘటన ను అనుసరించి సిఆర్ నంబర్ 86/2022 నమోదు చేసి యు/ సెక్షన్ 174 సిఆర్ పిసి ప్రకారం దర్యాప్తు చేపట్టడం జరిగింది. మృతునికి సంబంధించి అతని యొక్క సమాచారం/ఆచూకీ తెలిసిన యెడల, స్టేషన్ హౌస్ ఆఫీసర్, రైల్వే పోలీసు స్టేషన్, వికారాబాద్ కు సమాచారం అందించగలరని కోరారు. ఇతర వివరాలకు 9440627527 ఫోన్ సంప్రదించాలి.
Share this on your social network: