మాజీ ముఖ్యమంత్రి వైస్సార్ సేవలు చిరస్మరణీయం...

Published: Friday July 09, 2021
మెట్ పల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహమ్మద్ ఖుతుబోద్దీన్ పాషా
మెట్ పల్లి, జూలై 08 (ప్రజాపాలన ప్రతినిధి) : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతిని పురస్కరించుకొని పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం ఘనంగా వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ వైఎస్సార్ పాలనలో సామాన్యుల బతుకు వృత్తులను స్వయంగా గమనించి వాళ్ళలో భరోసా ధైర్యం నిరంతరం నింపడానికి కృషి చేశారని తెలిపారు. ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమానికి పెద్దపీట వేశారని గుర్తు చేశారు. పెద్దవారి అభ్యున్నతి కోసం నిరంతరం పాకులాడిన వైఎస్సార్ విగ్రహాన్ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేయడంతో పాటు పట్టణంలో ప్రధాన చౌరస్తా వద్ద ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమములో యూత్ నాయకులు ప్రశాంత్, మదర్ ఖాన్, అజయ్, జుబేర్, రహీమోద్దీన్, అశోక్, అరుణ్, యూత్ నాయకులు పాల్గొన్నారు.