ప్రభుత్వ భూమిని కాపాడాలి : అఖిలపక్షం డిమాండ్

Published: Tuesday June 08, 2021

బెల్లంపల్లి, జూన్ 7, ప్రజాపాలన ప్రతినిధి : బెల్లంపల్లి పట్టణం లోని సర్వే నంబర్ 109, 112, కన్నాల శివారు లోని ప్రభుత్వ భూముల్లో భూకబ్జాదారులు కబ్జా చేస్తూ అక్రమ నిర్మాణాలు చేస్తున్నారని ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని బెల్లంపల్లి పట్టణ అఖిలపక్షం సోమవారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బెల్లంపల్లి పట్టణంలో మెడికల్ కాలేజీ నిర్మాణం కోసం ప్రయత్నాలు జరుగుతుంటే మెడికల్ కాలేజీ కోసం కేటాయించిన స్థలాలు భూ అక్రమనదారులు కబ్జాలు చేస్తూ చిన్నచిన్న రూము నిర్మిస్తూ ఒక గుంట స్థలానికి రెండు లక్షల రూపాయల చొప్పున అమ్మకాలు చేస్తున్నారని ఇప్పటికైనా వారిపై వెంటనే చర్యలు తీసుకొని నిర్మాణాలను నిలుపుదల చేస్తూ మెడికల్ కాలేజ్ కోసం ప్రభుత్వ భూములను ఉపయోగించాలని స్థానిక మండల రెవెన్యూ అధికారికి మరియు ఆర్ డి ఓ గారికి వారు విజ్ఞప్తి చేశారు.