గోపాలపేటలో వైద్య శిబిరం

Published: Wednesday July 13, 2022
వైద్యశిభిరాన్ని ప్రారంభించిన సర్పంచ్ నల్లమోతు మోహన్ రావు..
తల్లాడ, జులై 12 (ప్రజా పాలన న్యూస్):
 *తల్లాడ ప్రాథమిక ప్రభుత్వ ఆసుపత్రి ఆధ్వర్యంలో మంగళవారం మండలంలోని గోపాలపేట గ్రామంలో వైద్య శిబిరం నిర్వహించారు. ప్రభుత్వ వైద్యులు డాక్టర్ గోపి ఆధ్వర్యంలో రోగులకు సీజనల్ వ్యాధుల పట్ల పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. తొలుత శిబిరాన్ని గోపాలపేట గ్రామ సర్పంచ్ నల్లమోతు మోహన్ రావు ప్రారంభించారు. అనంతరం డాక్టర్ గోపి మాట్లాడుతూ సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇంటి పరిసరాల్లో పరిశుభ్రంగా ఉంచుకోవాలని, వ్యాధులకు దూరంగా ఉండాలన్నారు. గ్రామ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ మోహన్ రావు కోరారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపర్వైజర్ పెద్ద పుల్లయ్య, ఆశా వర్కర్ రాయల శాంతమ్మ, స్థానిక సిబ్బంది పాల్గొన్నారు.