తెలంగాణ రాష్ట్ర సాధకుడు కేసీఆర్ కు మేడ్చల్ నియోజకవర్గంలో గుడి నిర్మిస్తాం... - షిరిడి సాయి బృ

Published: Wednesday September 07, 2022
హైదరాబాద్ (ప్రజాపాలన ప్రతినిధి ):
 
తెలంగాణ రాష్ట్రం సాధించడం కోసం  కృషి చేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు తాను వీరాభిమానిగా మారానని త్వరలో మేడ్చల్ జిల్లాలో గుడి నిర్మించబోతున్నట్లు షిరిడి సాయి బృందావనం పీఠం ఫౌండేషన్ వ్యవస్థాపకులు కిషోర్ కుమార్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఫౌండేషన్ సభ్యులు అనిల్ కుమార్, సురేందర్ రెడ్డి, సందీప్ గౌడ్, సత్యనారాయణలతో కలిసి మాట్లాడారు.. తెలంగాణ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళుతున్న కేసీఆర్ కు తాను వీరాభిమాని గా మారానని తెలిపారు. ఈ ఏర్పాటు చేయబోయే గుడి ప్రాంగణంలో ఉచిత విద్య, వైద్యం, గోశాల నిర్మాణం, నిత్య అన్నదాన కార్యక్రమాలను చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ గుడి కార్యక్రమాలను రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో ఏర్పాటు చేయనున్నట్లు దానిలో భాగంగానే మొదట విడత గా మేడ్చల్ జిల్లాలో ఏర్పాటు చేస్తున్నట్లు  తెలిపారు. కావున కెసిఆర్ అభిమానులు అందరూ తనకు సహకరించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయ వంతం చేయాల్సిందిగా కోరారు.