కేసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన పి ఎ సి ఎస్ చైర్మన్ ల సంఘం... హైదరాబాద్ (ప్రజాపాలన ప్రతి

Published: Friday December 23, 2022
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల(PACS) చైర్మన్ ల గౌరవ వేతనం పెచుతూ నిర్ణయం తీసుకుని జిఓ విడుదల చేసిన సందర్బంగా సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి పాలాభిషేకం నిర్వహించారు పి ఎ సి ఎస్ చైర్మన్ ల సంఘం ప్రతినిధులు. ఈ సందర్బంగా సంఘం రాష్ట్ర అధ్యక్షులు దయాకర్ రెడ్డి మాట్లాడుతూ నేరుగా రైతులతో సమన్వయం ఉండే తమకు గౌరవ వేతనాలు పెంచి ప్రోత్సహిస్తున్న ముఖ్యమంత్రి కె సి ఆర్  కు ధన్యవాదాలు తెలిపారు. గత ప్రభుత్వాల సమయం లో పి ఎ సి ఎస్ లు చాలా సమస్యలు ఎదుర్కొన్నామని తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తరువాత అందరిని ప్రోత్సహిస్తున్నారన్నారు, తమ సమస్యల పరిష్కారం విషయం లో సహకరించిన మంత్రులు కె టి ఆర్, వ్యవసాయ శాఖ మంత్రి, బోయినపల్లి వినోద్ కుమార్ తదితరులకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమం లో 
రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మంజుల రెడ్డి,సంజన వెంకటేష్, అధికార ప్రతినిధి ఆవుల రామారావు, సుదర్శన్, మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.