బెల్లంపల్లిలో ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు

Published: Friday February 18, 2022
బెల్లంపల్లి, ఫిబ్రవరి 17, ప్రజాపాలన ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెరాస పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, కెసిఆర్  జన్మదినోత్సవ వేడుకలు గత మూడు రోజులుగా జరిగాయి. పుట్టినరోజు అయిన గురువారం నాడు బెల్లంపల్లి పట్టణంలో ని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య కేకు కట్ చేసి ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు జరిగిన మూడు రోజుల వేడుకల్లో మొదటి రోజున అన్నదాన కార్యక్రమంతో పాటు పేదలకు పండ్లు పంపిణీ చేయగ, రెండవ రోజు రక్తదాన శిబిరం నిర్వహించి రక్తాన్ని సేకరించారు, మూడవ రోజైన గురువారం నాడు  ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో, ఇతర చోట్ల, మొక్కలు నాటి బుదా కాలాన్ సాయిబాబా దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా హిందూ, ముస్లిం, క్రైస్తవ, మతపెద్దలు వారి వారి సంప్రదాయాల ప్రకారం సర్వమత ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి ఎంపీపీ గోమాస శ్రీనివాస్, బెల్లంపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మోటపలుకుల రాజశేఖర్, బెల్లంపల్లి మున్సిపల్ చైర్మన్ జక్కుల శ్వేత, వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్, కౌన్సిలర్లు & కో ఆప్షన్ సభ్యులు, నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి కొమ్మెర లక్ష్మణ్, నియోజకవర్గ జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్ లు, ఇతర ప్రజాప్రతినిధులు, తెరాస నాయకులు, కార్యకర్తలు, కెసిఆర్ అభిమానులు, అధిక సంఖ్యలో పాల్గొన్నారు.