దళిత సంఘాల ఆద్వర్యంలో ర్యాలీని విజయవంతం చేయాలి
Published: Saturday October 15, 2022
జన్నారం, అక్టోబర్ 14, ప్రజాపాలన: నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో దళిత సంఘాల ఆద్వర్యంలో శనివారం జరిగే ర్యాలీని విజయవంతం చేయాలని జన్నారం మండల అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు సిటిమల భరత్ కూమర్ అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఖానాపూర్ నియోజకవర్గంలోని వివిధ మండలల దళితులు పాల్గొని భారీ ర్యాలీ నిర్వహించాలని అయన కోరారు. ఇటివల పెంబి మండలంలో నిరుపేద దళితులపై కోందరు వివిధ ఉన్నత వర్గాల వారు చేసిన అఘాయిత్యాలకు నిరసనగా దళిత సంఘాల సభ్యుల హజరై ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించ్చాలని అయన కోరారు. ఈ కార్యాక్రమంలో బోర్లకుంటా ప్రభూదస్, ఇందయ్య, దళితులు, తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: