ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ స్ఫూర్తితో 32వ వార్డులో కౌన్సిలర్ కార్యాలయం ప్రారంభం

Published: Thursday February 25, 2021
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 24 ( ప్రజాపాలన ) : ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ స్ఫూర్తితో 32వ వార్డులో కౌన్సిలర్ కార్యాలయాన్ని ప్రారంభించామని వార్డు కౌన్సిలర్ మల్లేపల్లి నవీన్ కుమార్ అన్నారు. బుధవారం మున్సిపల్ పరిధిలోని శివరాంనగర్ కాలనీలో 32వ వార్డుకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్ళపల్లి మంజుల రమేష్, వైస్ చైర్ పర్సన్ శంషాద్ బేగంలతో కలిసి రిబ్బన్ కట్ చేసి వార్డు కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా  కౌన్సిలర్  మాట్లాడుతూ ప్రజల సౌకర్యార్థం సమస్యలను తెలుసుకొని పరిష్కరించే విధంగా కృషి చేస్తామని తెలిపారు. వార్డు ప్రజలకు అను నిత్యం అందుబాటులో ఉండేందుకు ఈ  కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగిందని వివరించారు. ఎమ్మెల్యే గ్రామ గ్రామానికి తిరిగి వారి యొక్క సమస్యలను తెలుసుకుంటూ ప్రజల మధ్యలో ఉంటూ ప్రజా నాయకుడిగా మాకు ఆదర్శం గా నిలుస్తున్నారని కొనియాడారు. ఎమ్మెల్యే ఆధ్వర్యంలో పని చేస్తున్నందుకు నాకు గర్వంగా ఉందని పేర్కొన్నారు. అదేవిధంగా మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్ళపల్లి మంజుల రమేష్ మా వార్డు అభివృద్ధికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఎమ్మెల్యే చేపట్టే కార్యక్రమాలు మా ఇంటికి రండి, మీతో నేను, గులాబీ భరోసా వంటి వినూత్న కార్యక్రమాలతో ప్రజల మధ్య ఉంటూ సమస్యల పరిష్కారానికి చేసే కృషి అమోఘమని ప్రశంసించారు. ప్రజల మనసును గెలుచుకునే విధంగా చేపట్టే ప్రతి కార్యక్రమం ప్రజాకర్షణగా ఉన్నాయని చెప్పారు. నియోజకవర్గానికి నిఖార్సైన ఎమ్మెల్యే లభించడం మన అదృష్టంగా భావిస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వార్డు టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు జమాలుద్దీన్, వార్డు మైనారిటీ అధ్యక్షుడు ఫకీర్ పాషా, యూత్ అధ్యక్షుడు కృష్ణ, బిసి సెల్ అధ్యక్షుడు శివన్న, కాలనీ ప్రజలు పాల్గొన్నారు.