కొండగట్టులో పట్టువస్త్రాలు తలంబ్రాలు అందజేసిన దావ సురేష్

Published: Thursday April 22, 2021
జగిత్యాల, ఏప్రిల్ 21, (ప్రజాపాలన ప్రతినిధి): తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో జరిగే శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక్క పంపించిన పట్టు వస్త్రాలు ముత్యాల తలంబ్రాలను జగిత్యాల జిల్లా తెరాస యూత్ అధ్యక్షుడు దావ సురేష్ ఆలయ అర్చకుల బృందానికి అందజేశారు.