శంకరపట్నంలో కిరాణా షాపులో చోరీ

Published: Wednesday December 28, 2022

శంకరపట్నం డిసెంబర్ 27 ప్రజాపాలన రిపోర్టర్:

శంకరపట్నం మండల కేంద్రంలోని ప్రధాన రహదారి పక్కనే ఉన్న ప్రసాద్ కిరాణం అండ్ జనరల్ స్టోర్ లో సోమవారం అర్ధరాత్రి షాపు వెనకాల ఉన్న ద్వారం తాళం పగలగొట్టి షాపులో దూరి లక్ష రూపాయల నగదు 12 తులాల బంగారు ఆభరణాలను దోచుకెళ్లినట్టు బాధితుడు భూపతి ప్రసాద్ తెలిపారు.  మంగళవారం తెల్లవారుజామున బాత్రూంకి వెళ్లడానికి లేసిన ప్రసాద్ బయట ఉన్న కుక్క అరుపులతో వెళ్లి షాప్ వద్ద చూడగా తాళాన్ని పగలగొట్టి ఉండడానికి చూసి 100 కి ఫోన్ ద్వారా సమాచారం అందించగా పోలీసులు క్లూస్ టీమ్ ద్వారా వివరాలు సేకరిస్తున్నారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు  చేస్తున్నారు. అయితే ఇది ఇలా ఉండగా మండల కేంద్రంలో అనేక చోరీలు  వరుస దొంగతనాలు జరుగుతున్నాయి.  దీంతో మండల కేంద్రంలోని ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. నిలిచి ఉంచిన లారీల టైర్లు, నిలిపించిన ఆటో రిక్షా,  కొన్ని ద్విచక్ర వాహనాలను, వాహనాల్లోని బ్యాటరీలను ఎంతో చాకచక్యంగా చోరీకి  గురవుతుండడంలో  పోలీసుల నిఘా యంత్రాంగం  పై ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పోలీసులు తగు రక్షణ చర్యలు చేపట్టి ప్రజలకు భరోసా ఇవ్వాలని వారు కోరుతున్నారు