మైతాపూర్ పాఠశాలను సందర్శించిన- క్లస్టర్ రిసోర్స్ పర్సన్

Published: Wednesday March 29, 2023

రాయికల్, మార్చి 28 (ప్రజాపాలన ప్రతినిధి):రాయికల్ మండలం మైతాపూర్ గ్రామంలో ఎం.పీ.పీ.ఎస్ పాఠశాలను సందర్శించిన క్లస్టర్ రిసోర్స్ పర్సన్ కుడుకల రవీందర్. అనంతరం విద్యార్థుల గణితం కు సంబంధించిన ప్రగతి సామర్ధ్యాలను పరిశీలించడం,గణిత శాస్త్రానికి సంబంధించిన కొన్ని  గణిత ప్రశ్నలకు సమాధానాలను విద్యార్థులచే బోర్డు పైన క్లస్టర్ రిసోర్స్ పర్సన్ రవీందర్ చేయించారని  పాఠశాల ప్రధానోపాధ్యాయులు గట్టు రమేష్ నరసయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సి.హెచ్.రాజేందర్ తదితర ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.