ఆర్య వైశ్యునిపై దాడిని ఖండిస్తూ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో పోలీసులకు, మున్సిపల్ కమిషనర్ కి ఫ

Published: Thursday February 03, 2022

మధిర ఫిబ్రవరి 2 ప్రజాపాలన ప్రతినిధి : మున్సిపాలిటీ పరిధిలోని ఆర్టీసీ డిపో పక్క రోడ్డులో కాంట్రాక్టర్ బావమరిది ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్న ఆర్యవైశ్య డు పల్లపోతు ఉపేందర్ పై దాడి చేసి కులం పేరుతో దూషించటం పట్ల ఆర్యవైశ్య సంఘం నాయకులు ఈరోజు టౌన్ పోలీస్ స్టేషన్ లో, మున్సిపల్ కమిషనర్ కి ఫిర్యాదు చేశారు. అనంతరం ఈ సందర్భంగా ఆర్య వైశ్యులు మాట్లాడుతూ సంబంధిత వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఫిర్యాదు చేసిన వారిలో ఆర్యవైశ్య పట్టణ అధ్యక్షులు వనమా కిరణ్, మధిర సేవా సమితి అధ్యక్షులు పల్లపోతు ప్రసాద్ స్విమ్మర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు చల్లా సత్యనారాయణ, వాసవి క్లబ్ జోనల్ చైర్మన్ ఇరుకుల్ల సురేష్, మిరియాల కాశీ విశ్వేశ్వర రావు వంగవీటి రాజశేఖర్ బాధితులు పల్లపోతు ఉపేంద్ర. రామకృష్ణ, నందిగామ పురుషోత్తం, ప్రసాద్, వెచ్చ రామకృష్ణ, శ్రీనివాస రావు, తదితరులు పాల్గొన్నారు.