ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు శాంతి నిలయంలో కేక్ కట్ చేసి పండ్లు పంపిణీ చేసిన టిఆర్ఎస్ నాయక

Published: Monday July 25, 2022

బోనకల్, జులై 24 ప్రజా పాలన ప్రతినిధి: టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేసి పండ్ల పంపిణీ కార్యక్రమం మండల కేంద్రంలోని శాంతి నిలయంలో టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు చేబ్రోలు మల్లికార్జున రావు ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు.ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షులు బంధం శ్రీనివాసరావు, టిఆర్ఎస్ మండల కార్యదర్శి మోదుగు నాగేశ్వరరావు, మాజీ జెడ్పిటిసి బానోత్ కొండ , కొనకంచి నాగరాజు, కాకాని శ్రీనివాసరావు, ఇటికాల శ్రీనివాసరావు, బంధం నాగేశ్వరరావు, బోనకల్ ఉపసర్పంచ్ యార్లగడ్డ రాఘవ, షేక్ నజీర్, ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు మూడవత్ సైదా, ముస్లిం మైనార్టీ నాయకులు షేక్ సైదా, చెరుకు రామకృష్ణ , రాజారావు, చావా హనుమంతరావు, ఇబ్రహీం, ముత్తారపు వెంకటి తదితరులు పాల్గొన్నారు