పోస్టల్ శాఖలో అంతర్జాతీయ యోగా దినోత్సవం
Published: Tuesday June 22, 2021
మధిర, జూన్ 21, ప్రజాపాలన ప్రతినిధి : 21వ తేదీ మున్సిపాలిటీఅంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లా పోస్టల్ సూపరింటెండేన్ట్ ఆదేశాల మేరకు యోగా ప్రముఖ్ Dvn సోమేశ్వరరావు ఆధ్వర్యంలో పోస్ట్ ఆఫీస్ ఆవరణలో మధిర డివిజన్ పోస్టల్ ఉద్యోగులు ఆసనాలు, ప్రాణాయామం, సూర్యనమస్కారాలు, యోగాసనాలు వేసి యోగా దినోత్సవాన్ని జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ పోస్టల్ ఆఫీసర్ కే హరికృష్ణ, మధిర పోస్ట్మాస్టర్ బీ అచ్యుతరావు, ఉద్యోగులు శివరాజ్ శ్రీనివాసరావు, ఏ రాధాకృష్ణ, ఎస్ ప్రసాద్, ఎం వెంకటేశ్వర్లు, బి శేషు, ఎం సత్యనారాయణ, షేక్ అమీర్, బి హరీష్, కే కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: